ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భారీ వర్షాలు: నీట మునిగిన ప్రాంతాలు.. జనజీవనం అస్తవ్యస్తం

By

Published : Oct 13, 2020, 9:36 PM IST

Updated : Oct 13, 2020, 11:38 PM IST

గుంటూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో 241 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 150 ఎకరాల్లో ఉద్యానపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

భారీ వర్షాలు: నీట మునిగిన ప్రాంతాలు.. జనజీవనం అస్త్యవ్యస్తం
భారీ వర్షాలు: నీట మునిగిన ప్రాంతాలు.. జనజీవనం అస్త్యవ్యస్తం

గుంటూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో సుమారు 241 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 150 ఎకరాల్లో ఉద్యానపంటలు పూర్తిగా పాడైపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో ప్రధానంగా మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ మండలాల్లోని పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది.

ఆ పంటలకే ఎక్కువ నష్టం..

మిర్చి, పత్తి, మినుముులు, పసుపు, చెరకు పంటలకు నష్టం ఎక్కువగా జరిగింది. ఇప్పటికే జిల్లాలో ప్రస్తుత ఖరీప్ సీజన్​లో 32 శాతం అధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. వర్షాలు ఇంకా కొనసాగితే పంటల మనుగడకే ప్రమాదమని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి వెల్లడించారు.

జనజీవన స్తంభన..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో జనజీవనం స్థంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కృష్ణా తీర ప్రాంత మండలాల్లో వర్షాలతో పాటు వరదల ప్రభావం కనిపించింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. వాగులు, వంకలు పొంగి వంతెనల పైకి నీరు చేరటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వాహనదారులకు ఇక్కట్లు..

కొన్నిచోట్ల చిరు జల్లులు కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గుంటూరు నగరంలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా కనిపించింది. ఇక దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి, అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, మాచర్ల, మేడికొండూరు, ఫిరంగిపురం, సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది. పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు ఉధృతితో రోడ్డుపైన వరద ప్రవహించింది. ఫలితంగా తుళ్లూరుకు రాకపోకలకు అంతరాయం కలిగింది.

పెద్దమద్దూరు వద్ద..

అమరావతి నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో పెదమద్దూరు వద్ద కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ కారణంగా రెండు వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో వర్షం కారణంగా వీధులన్నీ జలమయమం కాగా గ్రామంలో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని వాహనంలో వరదనీటిలోనే తరలించాల్సి వచ్చింది.

డొంకరోడ్డుపై..

మేడికొండురు మండలం పాలడుగు వద్ద వాగు ఉద్ధృతికి డొంకరోడ్డుపై నీరు ప్రవహించింది. పరిసర ప్రాంతాల్లోని పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, పంట పొలాలన్నీ నీట మునిగాయి. అచ్చంపేటలో వద్ద వాగు పొంగిపొర్లి ప్రవహించింది. ఈ నేపథ్యంలో క్రోసూరు అచ్చంపేట మధ్య రాకపోకలు ఆగిపోయాయి. ప్రభుత్వ పాఠశాల, విద్యుత్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది.

సత్తెనపల్లిలో..

సత్తెనపల్లిలో వావిలాల ఘాట్ ప్రాంతంలో భారీ వర్షానికి నీరు ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడ్డారు. నాగన్న కుంట ధోబి ఘాట్ ప్రాంతాలు నీట మునిగినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెన్నాదేవి వద్ద..

వెన్నాదేవి వద్ద గండి వాగు ఉద్ధృతికి సత్తెనపల్లి - పిడుగురాళ్ల మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పెదకూరపాడు మండలం కంభంపాడు వాగు వద్ద వంతెనపై వర్షపునీరు ప్రవహించింది. ఈ క్రమంలో ఓ కారు డ్రైవర్ అలాగే ముందుకు వెళ్లగా నీటిలో కారుతో సహా కొట్టుకుపోయాడు. గమనించిన స్థానికులు బాధితులను సాహసోపేతంగా కాపాడారు. తాళ్ల సాయంతో కారుని సైతం ఒడ్డుకు చేర్చారు. మాచర్ల మండలంలో భారీ వర్షాలకు కొన్ని కాలనీలు నీట మునిగాయి. కొత్తపల్లిలో రహదారిపైనే వర్షపు నీరు ప్రవహిస్తోంది. కొన్ని ఇళ్లలోకి నీరు చేరింది.

కృష్ణా తీరం వెంట..

కృష్ణా తీరం ప్రాంతంలోని పంట పొలాలు వేలాది ఎకరాల్లో మునిగిపోయాయి. పది రోజుల క్రితం వచ్చిన వరదలకు కొన్ని పంటలు మునిగి పోగా తేరుకునే లోగానే మళ్లీ వర్షం, వరద రెండూ కలిసి రావటం తీవ్ర ప్రభావం చూపింది. పత్తి, మిరప, కంద, పసుపు, కూరగాయల పంటలు నీట మునిగిపోయాయి. వరద నీటిలో కేవలం ఆకులుపైకి తేలి కనిపిస్తున్నాయి.

ఇవీ చూడండి : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు

Last Updated : Oct 13, 2020, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details