ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యాలయం భూ కేటాయింపుపై ... హైకోర్టులో పిటిషన్ - భూకేటాయింపు వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పిల్

ఆత్మకూరు గ్రామ పరిధిలో తెదేపా రాష్ట్ర పార్టీ కార్యాలయం నిర్మాణానికి 3.65 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  హైకోర్టులో పిల్ దాఖలు చేశారు

తెదేపా రాష్ట్ర కార్యాలయం నిర్మాణ భూ కేటాయింపుపై ... హైకోర్టులో పిటిషన్
తెదేపా రాష్ట్ర కార్యాలయం నిర్మాణ భూ కేటాయింపుపై ... హైకోర్టులో పిటిషన్

By

Published : Dec 6, 2019, 4:59 AM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం , ఆత్మకూరు గ్రామ పరిధిలో తెదేపా రాష్ట్ర పార్టీ కార్యాలయం నిర్మాణానికి 3.65 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు . భూ కేటాయింపునకు సంబంధించి 2017 జూన్ 22న జారీచేసిన జీవో 228ని రద్దు చేయాలని కోరారు . నిర్మాణ అనుమతులకు విరుద్దంగా భవనాన్ని నిర్మిస్తున్నారన్నారు . సర్వే నంబరు 392 / 1 , 39278 , 392 / 1 , 392 / 8 నుంచి 392 / 10లోని వాగు పోరంబోకు భూమిని 99 ఏళ్లకు లీజ్ ఆధారంగా అధికారులు ఇచ్చారన్నారు . అక్రమ నిర్మాణాన్ని కూల్చేలా సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు . ఆ భూమిని వెనక్కి తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details