ఆంధ్రప్రదేశ్

andhra pradesh

GV. ANJANEYULU: వైకాపా ప్రభుత్వం వేల కోట్ల దోపిడీకి పాల్పడింది: జీవీ ఆంజనేయులు

పేదలకు ఇళ్ల పథకం ద్వారా వైకాపా ప్రభుత్వం 4 వేల కోట్లు, ల్యాండ్ డెవలప్​మెంట్ స్కీం పేరుతో మరో రెండు వేల కోట్ల దోపిడీకి పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు ఆరోపించారు.

By

Published : Jul 2, 2021, 7:37 PM IST

Published : Jul 2, 2021, 7:37 PM IST

జీవీ ఆంజనేయులు
జీవీ ఆంజనేయులు

మాట్లాడుతున్న జీవీ ఆంజనేయులు

పేదలకు ఇళ్ల పథకం ద్వారా.. వైకాపా ప్రభుత్వం... 4 వేల కోట్లు... ల్యాండ్ డెవలప్మెంట్ స్కీం పేరుతో మరో రెండు వేల కోట్లు దోపిడీకి పాల్పడిందని... మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. తెలుగుదేశం పాలనలో అర్హులైన పేదలకు మంజూరు చేసిన 5 లక్షల ఇల్లు దుర్మార్గంగా నిలిపివేశారని ఆరోపించారు. గుంటూరు జిల్లా వినుకొండలో... కొండల్లో అర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించారని బాధితులతో కలిసి నిరసన తెలిపారు. నివాసయోగ్యమైన ప్రదేశంలో స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details