ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాట్రపాడులో పర్యటించిన గుంటూరు అర్బన్ ఎస్పీ - కాట్రపాడులో పర్యటించిన గుంటూరు అర్బన్ ఎస్పీ

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామంలో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పర్యటించారు. అక్కడ ఊరికి పది మంది చొప్పున గ్రామ రక్షణ దళం పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ రక్షణ దళాలకు యూనిఫాంలను అందించారు.

అమరుడైన పోలీస్​ చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎస్పీ
అమరుడైన పోలీస్​ చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎస్పీ

By

Published : Oct 24, 2020, 10:50 PM IST

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కాట్రపాడు గ్రామంలో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పర్యటించారు. అక్కడ ఊరికి పదిమంది చొప్పున గ్రామ రక్షణ దళం కార్యక్రమాన్ని చేపట్టారు. అమరవీరుల వారోత్సవాలలో భాగంగా...2007లో బలిమెల నక్సలైట్ల కాల్పుల ఘటనలో మృతి చెందిన కానిస్టేబుల్ శ్రీకాండ్రు గౌరీ శంకర్ మృతదేహానికి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. ఎప్పుడైనా, ఏ అపద వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా దాని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీ గంగాధర్, సౌత్ డీఎస్పీ కమలాకర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలసుందరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

'ఆర్థిక లావాదేవీలే హత్యకు ప్రధాన కారణం'

ABOUT THE AUTHOR

...view details