సైకిల్పై దూసుకెళ్తున్న యువకుని పేరు బొగ్గవరపు శ్రీనివాస కిరణ్. గుంటూరు చెందిన కిరణ్కు చిన్నప్పట్నుంచీ సైక్లింగ్ అంటే అభిరుచి. అదే ఆ యువకుడికి అంతర్జాతీయస్థాయి గుర్తింపుతెచ్చిపెట్టింది. సైక్లింగ్పై ఉన్న ఆసక్తితో 2015లో విజయవాడలోని సైక్లింగ్ క్లబ్లో చేరారు. సైక్లింగ్ను ప్రోత్సహించే అంతర్జాతీయ సంస్థ అడాక్స్ క్లబ్ ఫారిసన్ గురించి తెలుసుకున్నాడు. ఫ్యారిస్ కేంద్రంగా పనిచేసే అడాక్స్ క్లబ్కు అనుబంధంగా మన దేశంలో అడాక్స్ ఇండియా ర్యాండోనియర్ క్లబ్ పనిచేస్తుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో నిరంతరాయంగా సైకిల్పై ఎక్కువ దూరం ప్రయాణించే పోటీలు జరుగుతుంటాయి. ప్రతి ఏటా నవంబర్ నుంచి మరసటి ఏడాది అక్టోబర్ వరకూ ఈ సైక్లింగ్ క్యాలెండర్ ఉంటుంది. ఆ పోటీల్లో పాల్గొన్న కిరణ్ విజయం సాధించి.. సూపర్ ర్యాండోనియర్గా గుర్తింపు పొందారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ గుర్తింపు పొందిన అతికొద్దిమందిలో కిరణ్ ఒకరు.
డబుల్ సూపర్ ర్యాండోనియర్
అడాక్స్ సంస్థ 5 విభాగాల్లో సైక్లింగ్ పోటీలు నిర్వహిస్తుంది. 200 కిలోమీటర్లను 13.5 గంటల్లో, 300 కిలోమీటర్లను 20 గంటల్లో, 400 కిలోమీటర్లను 27గంటల్లో, 600 కిలోమీటర్లను 40 గంటల్లో పూర్తి చేస్తే ప్రపంచస్థాయి గుర్తింపు వస్తుంది. 200 కిలోమీటర్ల విభాగం పూర్తి చేసిన వారిని ర్యాండోనియర్ అని... 600 కిలోమీటర్లను పూర్తి చేస్తే సూపర్ ర్యాండోనియర్ అని వ్యవహరిస్తారు. కిరణ్ 2018లో 200, 300 కిలోమీటర్ల లక్ష్యాలను పూర్తిచేశారు. ఆ తర్వాత 2019లో విజయవాడ-హైదరాబాద్ మార్గంలో 200, 300, 400 కిలోమీటర్ల లక్ష్యాలను చేరుకున్నారు. అలాగే విజయవాడ-తుని మార్గంలో 600 కిలోమీటర్ల లక్ష్యం పూర్తిచేశారు. మళ్లీ అదే సంవత్సరంలో రాజమహేంద్రవరం మార్గంలో 200, 300, 400 కిలోమీటర్లు, హైదరాబాద్ మార్గంలో 600 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇలా ఒకే ఏడాదిలో రెండు సార్లు సూపర్ ర్యాండోనియర్ లక్ష్యాన్ని పూర్తిచేశారు. కఠోర సాధనతో పాటు ఆహార నియమాలు పాటించటం ద్వారానే ఇది సాధ్యమైందని కిరణ్ అంటున్నారు.