ముఖ్యమంత్రి జగన్ మంచి లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని.. ఆయన ఆలోచనలకు తగ్గట్లు పనిచేయాలని గుంటూరు జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. ప్రత్తిపాడు, వింజనంపాడు సచివాలయాలను ఆకస్మికంగా సందర్శించారు.
గ్రామాల్లో జరిగే నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే సస్పెండ్ చేస్తామని ఇంజినీరింగ్ అసిస్టెంట్ను జేసీ హెచ్చరించారు. సచివాలయంలోని ఉద్యోగులు ఏం చదివారు.. ఏ పోస్టుల్లో పనిచేస్తున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ టీం వర్క్ చేయాలని సూచించారు.