ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2021, 7:19 AM IST

ETV Bharat / state

కరోనాతో జీజీహెచ్ వైద్యుడు ఆదిశేషుబాబు మృతి

గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో జనరల్ మెడిసిన్ వైద్యుడు ఆదిశేషుబాబు కరోనాతో మృతి చెందారు. సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైనా ఆయనను జీజీహెచ్​కు తరలించగా అక్కడ...గుండె పోటుతో మరణించారు.

కరోనాతో జీజీహెచ్ వైద్యుడు ఆదిశేషుబాబు మృతి
కరోనాతో జీజీహెచ్ వైద్యుడు ఆదిశేషుబాబు మృతి

గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో జనరల్ మెడిసిన్ వైద్యుడిగా పనిచేస్తున్న ఆదిశేషు బాబు కరోనాతో మృతిచెందారు. కొవిడ్ పాజిటివ్​గా నిర్దరణ కావటంతో కొన్నిరోజులుగా అతను హోం ఐసోలేషన్లో ఉన్నారు. సోమవారం ఒక్కసారిగా ఆయాసంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆదిశేషు బాబును...జీజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో గుండెపోటుతో ఆయన కుప్పకూలిపోయారు. కరోనా సమయంలో అలుపెరుగకుండా ఎందరో రోగుల ప్రాణాలను నిలబెట్టేందుకు ప్రోఫెసర్ ఆదిశేషుబాబు కృషి చేశారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి...అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ABOUT THE AUTHOR

...view details