ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ప్రైవేటు కొవిడ్ ల్యాబ్​లపై అధికారుల చర్యలు - గుంటూరులో రెండు ప్రైవేటు ల్యాబ్​లపై చర్యలు

కరోనా బాధితుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణపై రెండు ప్రైవేటు కొవిడ్ ల్యాబ్ పై గుంటూరు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు ల్యాబ్​లకు అపరాధ రుసుం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

private covid labs in guntur
ప్రైవేటు కొవిడ్ ఆస్పత్రులపై చర్యలు

By

Published : Apr 11, 2021, 9:28 PM IST

గుంటూరు నగరంలో కరోనా బాధితుల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై రెండు ప్రైవేటు కొవిడ్ ల్యాబ్​లపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గుంటూరులోని మైల్ స్టోన్ ల్యాబ్​కు 77వేల 520 రూపాయలు, యోనటస్ ల్యాబ్​కు 19వేల 509 రూపాయల చొప్పున అపరాధ రుసుం విధిస్తూ జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. జీవో నంబర్ 768 ప్రకారమే ఫీజులు తీసుకోవాలని.. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మొత్తం వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details