ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నీట్​లో గుంటూరు జిల్లా వాసికి 446వ ర్యాంకు

By

Published : Oct 17, 2020, 10:51 PM IST

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం బేతపూడికి చెందిన బత్తుల క్రిష్ణ చైతన్య నీట్​ ఫలితాల్లో 446వ ర్యాంకు సాధించాడు. ఎంబీబీఎస్ చదివి వైద్య సేవలు చేయడమే తన లక్ష్యమని చైతన్య తెలిపారు.

క్రిష్ణ చైతన్య
క్రిష్ణ చైతన్య

నీట్ ఫలితాల్లో గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం విద్యార్థి ప్రతిభ చూపాడు. బేతపూడికి చెందిన బత్తుల క్రిష్ణ చైతన్య జాతీయ స్థాయిలో 446వ ర్యాంకు సాధించాడు. చైతన్య తండ్రి సాంబశివరావు, తల్లి శ్రీలక్ష్మి. ఏపీ ఎంసెట్ లో రాణించిన చైతన్య 59వ ర్యాంకు సాధించాడు.

క్రిష్ణకు స్వీట్ తీసిపిస్తున్న ఆయన తండ్రి

ఎంబీబీఎస్ చదివి ప్రజలకు వైద్య సేవ చేయాలనే లక్ష్యంతో పరీక్షకు సంసిద్ధం అయ్యానని చైతన్య స్పష్టం చేశారు. నీట్​లో 446 వ ర్యాంకు రావడంపై సంతోషించారు. తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధించానని చైతన్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details