గుంటూరులోని పలు వార్డు సచివాలయాలను నగర కమిషనర్ చల్లా అనురాధ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెక్రటరీలు సకాలంలో విధులకు హాజరుకాకపోవటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల హాజరు పట్టికలు, డైరీలను తనిఖీ చేసింది. అనంతరం వాలంటీర్లు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.
ఉదయం 10 గంటలకే విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు అందజేయాల్సిన ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులను నిర్దేశిత సమయంలో వాలంటీర్లు అందజేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.