గుంటూరు జిల్లాలో కరోనా కట్టడికి పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. పాజిటివ్ కేసుల తీవ్రత అధికంగా ఉన్న 12 రెడ్జోన్ మండలాలను గుర్తించామన్నారు. మే 3 వరకు మండలాల మధ్య రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. అధికారులు, ఉద్యోగులు మండలాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు వ్యకిగత దూరం పాటించి విధులు నిర్వహించాలని ఆదేశించారు.
'జిల్లాల్లో మండలాల మధ్య రాకపోకలు నిషేధం' - గుంటూరు జిల్లా కొవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టిన కలెక్టర్
గుంటూరు జిల్లాలో మే 3 వరకు మండలాల మధ్య రాకపోకలను నిషేధించినట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో రెడ్, ఆరెంజ్ జోన్లలో ఉన్న మండలాలను గుర్తించామన్న ఆయన.. అధికారులు, ఉద్యోగులు మండలాల్లోనే ఉండి పనిచేయాలని స్పష్టం చేశారు.
వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టామని చెబుతున్న గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్