ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వినాయక చవితి వేడుకలు తక్కువ మందితో చేసుకోవాలి'

కరోనా విజృంభిస్తున్న వేళ వినాయక చవితి వేడుకల్లో గుమిగూడొద్దని నగర కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. పరిమిత సంఖ్యలోనే భక్తులు ఉండాలన్నారు.

By

Published : Aug 12, 2020, 11:37 PM IST

guntur city commisioner on vinayaka chavithi celebrations
"మట్టి గణపతే.. మహా గణపతి" అనే పోస్టర్ ఆవిష్కరిస్తున్న కమిషనర్

కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు తక్కువ మందితో జరుపుకోవాలని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. ఎకో గణపతి విగ్రహాలనే వినియోగించాలని ప్రజలను కోరారు.

గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జె.సి.ఐ. గుంటూరు గూగుల్ స్వచ్చంద సంస్థ రూపొందించిన "మట్టి గణపతే.. మహా గణపతి" అనే పోస్టర్ ని ఆవిష్కరించారు. జె.సి.ఐ. గుంటూరు గూగుల్ స్వచ్చంద సంస్థ మట్టితో తయారు చేసిన మట్టి విగ్రహాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు.

ABOUT THE AUTHOR

...view details