గతంలో ఇసుక కొరతతో నాలుగు నెలలు ఇబ్బందులు పడిన కూలీలు, భవనాలకు రంగులు వేసే పెయింటర్లు.. లాక్డౌన్తో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు బొంగరాల బీడుతోపాటు నగరంలో వేలాదిమంది పెయింటర్లున్నారు. లాక్డౌన్తో పనిలేక కుటుంబాలను పోషించలేక అగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఉచిత బియ్యం, వెయ్యి రూపాయలు ఇచ్చినప్పటికీ కొందరికే పరిమితమయ్యాయని.. అందరికీ ఉపశమనం దక్కలేదని వాపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
లాక్డౌన్ ఎఫెక్ట్ : భవన నిర్మాణ కార్మికుల వెతలు - పేయింటింగ్ కార్మికులపై లాక్డౌన్ ఎఫెక్ట్
లాక్డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు లేక కుటుంబ పోషణ భారమవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
![లాక్డౌన్ ఎఫెక్ట్ : భవన నిర్మాణ కార్మికుల వెతలు guntur building and painting workers are facing problems due to the corona lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6958287-1064-6958287-1587975177619.jpg)
guntur building and painting workers are facing problems due to the corona lockdown