ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తమలపాకు' రైతు పంట పండేదెప్పుడో! - గుంటూరు తమలపాకు రైతుల ఇబ్బందులు

శుభకార్యం ఏదైనా తమలపాకు తప్పనిసరి. ఇక తాంబూలానికైతే చెప్పనక్కర్లేదు. అందరి నోళ్లు పండించే తమలపాకు..వాటిని సాగు చేసే రైతులను కష్టపెడుతోంది. లాక్​డౌన్ కారణంగా మూడు నెలలుగా తమలపాకు ఎగుమతి లేక లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు గుంటూరు జిల్లా రైతులు.

'తమలపాకు' రైతు పంట పండేదెప్పుడో!
'తమలపాకు' రైతు పంట పండేదెప్పుడో!

By

Published : Jun 26, 2020, 6:49 PM IST

Updated : Jun 26, 2020, 8:49 PM IST

'తమలపాకు' రైతు పంట పండేదెప్పుడో!

గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో కాపూరి రకం తమలపాకుల సాగుకు పెట్టింది పేరు. ఇక్కడ నుంచి దేశం నలుమూలలకు తమలపాకులు ఎగుమతి అవుతుంటాయి. పంట అల్లుకు వచ్చిన తర్వాత 25 రోజులకు ఒకసారి ఆకులు మొత్తం కోసి మార్కెట్​కు తరలిస్తుంటారు రైతులు.

కరోనా ప్రభావంతో ఎగుమతులు లేక రైతులు ఆకులు కోయటంలేదు. అవి పాదునే ముదిరిపోతున్నాయి. కొంతమంది రైతులు ఏంచేయలేని పరిస్థితుల్లో ఆకులు కోసి అక్కడే పారబోస్తున్నారు. పొన్నూరు, చింతలపూడి, ములుకుదురు ఆలూరు తదితర గ్రామాల్లో గతంలో రెండు వేల ఎకరాల్లో తమలపాకు సాగు చేసేవారు. కానీ పరిస్థితుల ప్రభావంతో ప్రస్తుతం సుమారు 800 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు.

ఎకరాకు రూ.50 వేలు చెల్లించి కౌలు చేస్తున్నాం. ఎగుమతులు లేక ఆకులు కోయలేకపోతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.

-నాగరాజు, తమలపాకు సాగుచేస్తున్న రైతు

ఇక్కడ నుంచి ప్రతిరోజు పొరుగు రాష్ట్రాలకు ఆకులను ఎగుమతి చేసే వాళ్ళం. లాక్​డౌన్ కారణంగా మూడు నెలలుగా ఎగుమతులు లేక వ్యాపారులు అందరం ఇబ్బందులు పడుతున్నాం. -అప్పారావు, వ్యాపారి

అన్ని పంటలకు ప్రభుత్వం సబ్సిడీలు అందజేస్తోంది. తమలపాకును కూడా ఈ జాబితాలో చేర్చి సబ్సిడీలు అందజేయాలి. నష్టపోయిన రైతలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. -సుపూరు, రైతు

లక్షల పెట్టుబడితో సాగుచేసిన పంట...కళ్ల ముందే ముదిరిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :'అందమైన జీవితాన్ని... మత్తుకు బలి చేయొద్దు'

Last Updated : Jun 26, 2020, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details