ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 26, 2020, 10:22 PM IST

ETV Bharat / state

వృత్తి పట్ల మీ నిబద్ధతకు మా వందనం..!

కరోనాపై పోరులో పోలీసులు నిరంతరం శ్రమిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గుంటూరు లాలాపేటలో ఓ ఏఎస్సై విధులు నిర్వహిస్తూనే.. రంజాన్​ సందర్భంగా నడిరోడ్డుపైనే నమాజ్​ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వృత్తి పట్ల అతని నిబద్ధతను తోటి సిబ్బంది ప్రశంసిస్తున్నారు.

వృత్తి పట్ల మీ నిబద్ధతకు మా వందనం..!
వృత్తి పట్ల మీ నిబద్ధతకు మా వందనం..!

నడిరోడ్డుపై నమాజ్​ చేస్తున్న ఏఎస్సై

గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో లాలాపేట పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఏఎస్సై కరీముల్లా ఓ వైపు విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు రంజాన్​ మాసం సందర్భంగా నడిరోడ్డుపై నమాజ్​ చేశారు. కరోనాపై పోరులో ఎండనక, వాననక శ్రమిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. తమ కష్టాన్ని చూసైనా.. ప్రజలెవరూ ఇళ్లలోనుంచి బయటకు రావద్దని పోలీసులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details