ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో సైనికోద్యోగి కాల్పుల కలకలం - gun-fire-in-guntoor-district

gun fire-in-guntoor-district
gun fire-in-guntoor-district

By

Published : Feb 22, 2020, 9:40 AM IST

Updated : Feb 22, 2020, 11:41 AM IST

09:35 February 22

బాధిత మహిళ

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం నడింపల్లిలో కాల్పులు కలకలం సృష్టించాయి. రమాదేవి అనే మహిళపై సైనికోద్యోగి బాలాజీ కాల్పులు జరిపాడు. ఆమె కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ గత కొంత కాలంగా బాలాజీ  వెంటపడుతున్నాడు. ఈ క్రమంలో రమాదేవిపై బాలాజీ కాల్పులు జరిపాడు. తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. చివరికి తమపై దాడి చేశాడని రమాదేవి ఆరోపించారు. తన కుటుంబసభ్యులను చంపేస్తానంటూ బాలాజీ పిస్టల్ తీసుకువచ్చాడని కన్నీళ్లు పెట్టుకున్నారు.

పరారీలో బాలాజీ.. 

బాలాజీ కాల్పుల ఘటనలో రమాదేవి బయటపడింది. ఆమె చెవికి గాయమైంది. ఘటన జరిగిన వెంటనే బాలాజీ పరారవగా.. అతనికి సహకరించిన ఆటో డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి:

సిట్ కాదు.. సీబీఐతో విచారణ జరిపించండి: ఎంపీ గల్లా

Last Updated : Feb 22, 2020, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details