ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏజీ కళాశాలలో వేరుశనగ విత్తనాల ప్రాసెసింగ్‌ యూనిట్​ - bapatla ag college latest news

బాపట్ల ఏజీ కళాశాలలో వేరశనగ విత్తనాల ప్రాసెసింగ్​ యూనిట్​ను ఆంగ్రూ వీసీ మధుసూదనరెడ్డి ప్రారంభించారు. ఈ యూనిట్​ను ఏర్పాటు చేయడానికి రూ. 60 లక్షల నిధులు ఐసీఏఆర్ కేటాయించారు. ఈ ఖరీఫ్​ కాలం నుంచి విత్తనోత్పత్తిని ప్రారంభించనున్నట్లు కళాశాల ఏడీ తెలిపారు.

Groundnut seeds processing unit in ag college at bapatla college
రాయితీ ధరతో నాణ్యమైన సరకు సరఫరా

By

Published : Jul 21, 2020, 3:32 PM IST

తీర ప్రాంతంలో వేరుశనగ పంట వేల హెక్టార్లలో సాగవుతోంది.. అయితే పంట పండించే రైతులకు రాయితీ విత్తనం దక్కక రూ.కోట్లు నష్టపోతున్నారు. మరోవైపు ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేసిన విత్తనం నాణ్యత లేకపోవడం వల్ల దిగుబడులు లేక నష్టపోతున్నారు. సమస్య తీవ్రత నేపథ్యంలో గుంటూరు జిల్లా బాపట్లలోని ఏజీ కళాశాల క్షేత్రంలో రూ.60 లక్షల ఐసీఏఆర్‌ నిధులతో వేరుశనగ విత్తనాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు రాయితీపై దక్కనున్నాయి.

వేరుశనగ పంటను కర్లపాలెం, పిట్టలవానిపాలెం, చెరుకుపల్లి, నిజాంపట్నం మండలాల్లోని 5789 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 2010 వరకు 50 శాతం రాయితీపై వేరుశనగ విత్తనాలు ఏపీ సీడ్స్‌ ద్వారా ప్రభుత్వం అందజేసేది. ఆ తర్వాత ఏపీ సీడ్స్‌ చేతులెత్తేయడం వల్ల రాయితీపై విత్తనాల సరఫరా నిలిచిపోయింది. ఈ పంట సాగులో విత్తన వ్యయం ఎక్కువగా ఉంటుంది. విత్తనాల కొనుగోలుకే ఎకరాకు రూ.15 వేల వరకు ఖర్చవుతోంది. రాయితీ నిలిచిపోవడం వల్ల జిల్లాలో రైతులకు ఏటా రూ.3 కోట్ల పైన భారం పడుతోంది.

రైతులకు ఎంతో లాభం

భారత వ్యవసాయ పరిశోధనా మండలి నూనె గింజల ఉత్పత్తిని పెంచాలన్నా లక్ష్యంతో రైతులకు నాణ్యమైన వేరుశనగ విత్తనాల ఉత్పత్తి కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద బాపట్ల ఏజీ కళాశాల క్షేత్రంలో వేరుశనగ విత్తనాల ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయడానికి రూ.60 లక్షల నిధులు కేటాయించారు. క్షేత్రంలో పది ఎకరాల భూమి కేటాయించారు. రైతులతో ఒప్పందం చేసుకుని బ్రీడర్‌ విత్తనాలతో పంట సాగు చేయించి ఏటా 90 టన్నుల ఫౌండేషన్‌, సర్టిఫైడ్‌ విత్తనాలు ఉత్పత్తి చేసి రాయితీపై సాగుదారులకు విక్రయిస్తారు. ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ఆంగ్రూ వీసీ మధుసూదనరెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌ నుంచే విత్తనోత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఏజీ కళాశాల ఏడీ కృష్ణయ్య పేర్కొన్నారు.

ఇదీ చదవండి :

వేరుశనగ పంటలను పరిశీలించిన తహసీల్దార్

ABOUT THE AUTHOR

...view details