ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్తా చాటిన గవర్న్​మెంట్ పాఠశాల విద్యార్థులు

చదివేది సర్కారు బడుల్లో అయినా ఆ విద్యార్థులు ప్రభుత్వ అండతో... స్యయంకృషితో రాణించారు. ఉపకార వేతనం కోసం జరిపే పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ బడులు ప్రైవేటు పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోవని నిరూపించారు.

By

Published : Mar 29, 2019, 5:11 AM IST

Updated : Mar 29, 2019, 10:26 AM IST

students

సత్తా చాటిన గవర్న్​మెంట్ పాఠశాల విద్యార్థులు
నవంబర్4, 2018న జరిగిన నేషనల్ మీన్స్ కమ్‌ మెరిట్ స్కాలర్​షిప్స్ ఫలితాలలో గవర్న్​మెంట్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పేద విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు అందించాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ ఎన్.ఎం.ఎస్, ఎన్.టీ.ఎస్. పరీక్షల్లో మున్సిపల్ పాఠశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. ఈ నెల 27న విడుదలైన ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా 506 మంది మున్సిపల్ పాఠశాల విద్యార్థులు అర్హత సాధించారు.

రాష్ట్ర నలుమూలల నుంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులతో విద్యార్థులకు శిక్షణ ఇప్పించామని డెరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కె.కన్నబాబు తెలిపారు. గతేడాది కంటే ఈ సంవత్సరం 41 శాతం అధికంగా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ విజయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మార్కులు పొందిన రోహిణి ప్రియంవద, దినేష్, గణేష్​ను ఆయన అభినందించారు. స్టేట్ ర్యాంకులు సాధించిన వారికి ప్రతి సంవత్సరం 12వేల చొప్పున 4ఏళ్లపాటు ఉపకార వేతనం అందుతుందని తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ విజయం మున్సిపల్ పాఠశాలలకు గర్వకారణమని ప్రశంసించారు.

Last Updated : Mar 29, 2019, 10:26 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details