ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెండింగ్ వేతనాలు అడిగితే.. ఉద్యోగాల నుంచి తొలగించారు'

గుంటూరు జీజీహెచ్​లో ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. పెండింగ్​లో వేతనాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

By

Published : Sep 20, 2021, 1:36 PM IST

ggh out sourcing employees protest
ggh out sourcing employees protest

పెండింగ్​లో ఉన్న వేతనాలను చెల్లించాలని అడిగితే... తమని ఉద్యోగాల్లో నుంచి తొలగించారని ఔట్ సోర్స్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. తమని తక్షణమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని.. పెండింగ్ లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరుతూ గుంటూరు జీజీహెచ్​లో నిరసన చేపట్టారు. గత 10 ఏళ్లుగా జీజీహెచ్​లో పనిచేస్తున్న తమకు 15 నెలలు నుంచి వేతనాలు రావడం లేదని కోర్టుని ఆశ్రయిస్తే... తమని ఈనెల 16న ఉద్యోగాల నుంచి తొలగించాలని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నంవంబర్ 11న 40మంది కాంట్రాక్ట్ సిబ్బందిని ఆంద్రప్రదేశ్ ఔట్ సోర్స్ కార్పొరేషన్ లో చేర్చుకుని ధ్రువీకరణ పత్రాలు అందచేశారని చెప్పారు. దీంతో తెల్ల రేషన్ కార్డు, సంక్షేమ పథకాలు అన్ని తొలగించారని వాపోయారు. అటు ఉద్యోగం పోయి ఇటు సంక్షేమ పథకాలు పోయి రోడ్డున పడ్డామని ఆవేదన చెందారు. తక్షణమే తమని విధుల్లోకి తీసుకోవలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:VARIETY REQUEST: బ్యాలెట్​ బాక్స్​లో చీటీ..మందుబాబు విజ్ఞప్తి చూస్తే షాక్​..

ABOUT THE AUTHOR

...view details