ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. గుంటూరులోని జీజీహెచ్లో కొందరు ఉద్యోగుల కాసుల వేటలో నిమగ్నమయ్యారు. ఆస్పత్రిలో పడక కోసం రూ.5వేలు డిమాండ్ చేసి.. చివరకు 500 రూపాయలు ఇవ్వాలని రోగి బంధువును బొబ్బిలి శ్రీనివాసరావు అనే నాలుగో తరగతి ఉద్యోగి అభ్యర్థించిన దృశ్యాలు వైరల్గా మారాయి. ఈ ఘటన జిల్లా యంత్రాంగం దృష్టికి రావడంతో.. జాయింట్ కలెక్టర్ ప్రశాంతి అతడిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తూ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జేసీ ప్రశాంతి హెచ్చరించారు. మరో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పాత్రపైనా విచారణ జరిపాలని సూపరింటెండెంట్కు తెలిపారు.
కాసుల వేటలో జీజీహెచ్ ఉద్యోగులు.. ఒకరు సస్పెండ్ - ggh employee suspend latest news
ప్రజలు అస్పత్రుల్లో పడకలు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. గుంటూరులోని జీజీహెచ్లో కొందరు సిబ్బంది లంచాలు తీసుకుంటూ రోగులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆస్పత్రిలో పడక కోసం రూ.5వేలు డిమాండ్ చేసి.. చివరకు 500 రూపాయలు ఇవ్వాలని రోగి సహాయకుడిని ఓ ఉద్యోగి అభ్యర్థించిన దృశ్యాలు వైరల్గా మారాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. అతడిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
![కాసుల వేటలో జీజీహెచ్ ఉద్యోగులు.. ఒకరు సస్పెండ్ ggh employee suspend](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:58:15:1620664095-ap-gnt-06-10-ggh-employee-suspenshion-av-3067949-10052021211205-1005f-1620661325-340.jpeg)
ggh employee suspend
Last Updated : May 11, 2021, 1:17 PM IST