‘గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకై ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అల్లూరులోని ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారు గుడిసెలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల వల్ల గ్యాస్ సిలిండర్ అంటుకుని లీక్ అయ్యింది.
అల్లూరులో గ్యాస్ లీకేజీ ... ఇద్దరు మృతి - అల్లూరిలో గ్యాస్ లీక్

అల్లూరులో గ్యాస్ లీకేజీ
11:31 September 03
మంటలకు లోపల ఉన్నవారు బయటకు రాలేక పోయారు. గుంటూరుకు చెందిన కుమార్ (32),విజయవాడకు చెందిన అనపర్తమ్మ(40) ఇద్దరూ సజీవదహనమయ్యారు. బయట నిద్రిస్తున్న మరికొంతమంది పంచ నుంచి బయటకు దూకడంతో వారికి స్వల్పగాయాలయ్యాయి.
ఇదీ చదవండి: 5,800 ఆవులతో వెళ్తూ మునిగిన నౌక
Last Updated : Sep 3, 2020, 3:26 PM IST