మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి (86) బ్లాక్ ఫంగస్తో కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. కొన్నిరోజుల క్రితం రామిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన బ్లాక్ ఫంగస్కు గురయ్యారు. క్రమంగా తీవ్ర ఆనారోగ్యానికి గురై కన్నుమూశారు. 1967 - 1972 మధ్య రామిరెడ్డి గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎమ్మెల్యేగా సేవలందించారు.
అవుతు రామిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలి..