వైకాపా ప్రభుత్వం ఒక సామాజిక వర్గం వారిపైనే కక్ష సాధిస్తోందని... మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కూడా అదే కోవలోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గుంటూరులో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి పోస్టింగులు ఇవ్వకుండా... వేతనాలు, ఇతర లబ్ది చేకూరకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో బాగా పనిచేసిన వారిని వైకాపా లక్ష్యంగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సైతం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి కక్ష పూరిత రాజకీయాలు మంచివి కాదని ప్రభుత్వానికి హితవు పలికారు.
కక్షపూరిత రాజకీయాలు మంచిది కాదు: ప్రత్తిపాటి పుల్లారావు - మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వార్తలు
వైకాపా ప్రభుత్వం ఒక సామాజిక వర్గం వారిపైనే కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కక్ష పూరిత రాజకీయాలు మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
![కక్షపూరిత రాజకీయాలు మంచిది కాదు: ప్రత్తిపాటి పుల్లారావు former minister prathipati pullarao fires on ycp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6022616-736-6022616-1581332042177.jpg)
వైకాపాపై మండిపడ్డ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
వైకాపాపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు