ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2020, 7:21 PM IST

Updated : Apr 27, 2020, 7:42 PM IST

ETV Bharat / state

పిడుగురాళ్లలో కరోనా.. మొదటి పాజిటివ్ కేసు నమోదు!

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఈ ప్రాంతాన్ని అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా కేసు నమోదు
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి కరోనా కేసు నమోదు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దాచేపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి (29)... ఓ ల్యాబ్ టెక్నీషియన్ వద్ద షుగర్ పరీక్ష చేయించుకున్నాడు. సదరు టెక్నీషియన్​కు తర్వాత కరోనా సోకింది. కొన్నాళ్లకు.. విపరీతమైన దగ్గు, శ్వాస సమస్యతో పిడుగురాళ్ల పట్టణంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆ వ్యక్తి చికిత్స చేయించుకున్నాడు. అనుమానంతో కరోనా పరీక్ష చేయగా... అతనికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఆ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారాని గురజాల ఆర్డీవో పార్థసారధి తెలిపారు.

Last Updated : Apr 27, 2020, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details