గుంటూరు జిల్లా చక్రాయపాలెం తండాలో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు మరణించారు. ఉదయబాబు అనే వ్యక్తికి చెందిన కిరణా షాపులో లూజ్ పెట్రోల్ విక్రయిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న కట్టెల పొయ్యికి సెగకు మంటలు అంటుకున్నాయి. వేగంగా వ్యాపించాయి. ఆ మంటల్లో ఇల్లు తగలబడింది. లోపల ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు కృపాబాయి (2) సజీవ దహనం కాగా.. పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శివనాయక్(3) మృతి చెందాడు.
లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు.. ఇద్దరు చిన్నారులు మృతి - పెట్రోల్తో మంటలు ఇద్దరు చిన్నారులు మృతి న్యూస్
గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం తండాలో ఘోరం జరిగింది. లూజు పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు వ్యాపించి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
లూజ్ పెట్రోల్ విక్రయిస్తుండగా మంటలు.. ఇద్దరు చిన్నారులు మృతి