ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 21, 2020, 11:16 AM IST

ETV Bharat / state

మార్కెట్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం... బూడిదైన సామగ్రి

గుంటూరు చేపల మార్కెట్ కాంప్లెక్స్​లోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

fire accident in guntur fish market complex
గుంటూరు మార్కెట్ కాంప్లెక్స్​లో అగ్నిప్రమాదం

గుంటూరు చేపల మార్కెట్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ సెల్ ఫోన్ల దుకాణంలో చెలరేగిన మంటలు... పక్క దుకాణాలకూ వ్యాపించాయి. ఈ ఘటనలో చరవాణుల దుకాణంలోని సామగ్రి దగ్ధమైంది.

అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు మార్కెట్ కాంప్లెక్స్​లో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details