ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2021, 11:37 AM IST

ETV Bharat / state

భట్టిప్రోలు మండలంలో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో రెండు వేర్వేరు చోట్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు రైతుల వరి కుప్పలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.

దగ్ధమైన వరికుప్ప
దగ్ధమైన వరికుప్ప

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో రెండు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పల్లెకోన గ్రామ శివారులోని పంట పొలాల్లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి మూడు ఎకరాల్లో ఉన్న ఇద్దరు రైతుల వరి కుప్పలు దగ్ధం అయ్యాయి. మరోవైపు కన్నిగంటి వారిపాలేనికి చెందిన మరో రైతుకు సంబంధించిన రెండు ఎకరాల్లో వరి కుప్ప అగ్నికి ఆహుతయ్యింది. మంటలను గమనించిన రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అయితే ఈ ఘటనలో చేతికి వచ్చిన పంట పూర్తిగా కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు సుమారు 50 వేలకు పైగా నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details