గుంటూరు జిల్లా బాపట్ల మండలం రాంనగర్లో మత్స్యకారుడి కుటుంబాన్ని గ్రామ పెద్దలు వెలివేశారు. మొక్కలు నాటే పథకంలో నాగరాజు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు అతనికి గ్రామ పెద్దలు రూ.2.50 లక్షలు జరిమానా విధించారు. గడువులోపు నాగరాజు డబ్బులు చెల్లించకపోవడంతో 2 వారాల క్రితం గ్రామ పెద్దలంతా దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామ పెద్దలు నాగరాజు కుటుంబాన్ని వెలివేసినట్లు ప్రకటించారు. చేపల వేటకు సైతం వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.
కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు...ఎందుకంటే..! - గుంటూరు జిల్లా తాజా వార్తలు
మొక్కలు నాటే పథకంలో అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఓ వ్యక్తికి గ్రామ పెద్దలు జరిమానా విధించారు. గడువులోపు సొమ్ము చెల్లించలేదని దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడని అతని కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారు.
![కుటుంబాన్ని వెలివేసిన గ్రామ పెద్దలు...ఎందుకంటే..! Expulsion of the family by The village elders in ramnagar, bapatla mandal in guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7524379-240-7524379-1591597732934.jpg)
Expulsion of the family by The village elders in ramnagar, bapatla mandal in guntur district