ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బార్​ అండ్​ రెస్టాంరెట్లలో అధికారుల దాడులు - ఎక్సైజ్ అధికారులు తనిఖీలు

లాక్​డౌన్​ నేపథ్యంలో బార్​ అండ్​ రెస్టారెంట్లలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులకు వ్యతిరేకంగా ఉన్న మద్యం దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

బార్​ అండ్​ రెస్టాంరెట్లలో అధికారుల దాడులు
బార్​ అండ్​ రెస్టాంరెట్లలో అధికారుల దాడులు

By

Published : Apr 15, 2020, 9:12 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఓ ప్రైవేట్​ బార్​ అండ్​ రెస్టారెంట్​లో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. బార్​లోని మద్యం స్టాక్​కు సంబంధించిన రికార్డులను ఎక్సైజ్ సీఐ సుహాసిని పరిశీలించారు. తనిఖీ చేసిన అనంతరం బార్​ అండ్​ రెస్టారెంట్​ను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

గుత్తి పట్టణంలోని బార్​ అండ్​ రెస్టారెంట్​లో ఆకస్మిక తనిఖీ

పాడేరు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ తనిఖీలు

విశాఖ మన్యం పాడేరులో మద్యం దుకాణాల్లో రెవెన్యూ, పోలీస్​, ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు. మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలను లెక్కగట్టి కొన్ని దుకాణాలను సీజ్ చేశారు.

పాడేరు మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ తనిఖీలు

ఆబ్కారీ శాఖ తనిఖీలు

గుంటూరు జిల్లా ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోసూరు సీఐ రవీంద్రబాబు ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని మద్యం దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకూ పరిశీలించిన మద్యం దుకాణాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని సీఐ వెల్లడించారు.

ఆబ్కారీ శాఖ తనిఖీలు

చిలకలూరిపేటలో ఆకస్మిక తనిఖీలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని 11 బార్​ అండ్​ రెస్టారెంట్​లు, 9 మద్యం దుకాణాలలో అధికారులు తనిఖీ చేశారు. గుంటూరు ఎక్సైజ్ సీఐ రేఖా రెడ్డి, ఎస్​ఐ మాధవి, వార్డు సచివాలయ సిబ్బంది, పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సీలు వేసే ముందు ఉన్న నిల్వలు ప్రస్తుతం ఉన్న నిల్వలను పరిశీలించి తేడా ఉన్న దుకాణాలపై కేసు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ రేఖా రెడ్డి తెలిపారు.

చిలకలూరిపేటలో ఆకస్మిక తనిఖీలు

మద్యం దుకాణాల్లో తనిఖీ చేసిన జిల్లా టాస్క్​ఫోర్స్

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని రవి తేజ బార్​ అండ్​ రెస్టారెంట్​లో జిల్లా టాస్క్​ఫోర్స్​ ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. బార్​ అండ్​ రెస్టారెంట్​ను పరిశీలించిన అనంతరం ఎటువంటి తేడాలు లేవని రెవెన్యూ అధికారులు, ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

మద్యం దుకాణాల్లో తనిఖీ చేసిన జిల్లా టాస్క్​ఫోర్స్

అద్దంకిలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ

ప్రకాశం జిల్లా అద్దంకి, కొరిసపాడు మండలాల్లోని మద్యం దుకాణాలలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. అద్దంకి ఎక్సైజ్​ సీఐ శ్రీనివాసులు సిబ్బందితో కలిసి మద్యం దుకాణాలలో సోదాలు నిర్వహించారు. రికార్డుల్లో ఉన్న నిల్వలు... దుకాణాల్లో ఉన్న నిల్వలతో సరిపోయినట్లు సీఐ వెల్లడించారు.

అద్దంకిలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ

ఇదీ చూడండి:లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమణ...బార్ నిర్వాహకులపై కేసు

ABOUT THE AUTHOR

...view details