ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో వరదలు.. కంట్రోల్ రూమ్​ల ఏర్పాటు - guntur control room numbers

కుండపోత వర్షాల కారణంగా గుంటూరు జిల్లాలోని జలశయాలకు వరద పోటెత్తుతోంది. జిల్లాలోని నదిపరివాహక ప్రాంతం వరద ఉద్ధృతిలో చిక్కుకుంది. పంటలు నీట మునిగాయి. ప్రజలకు సహాయం చేసేందుకు అధికారులు కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేశారు.

establishment of control rooms
కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు

By

Published : Oct 14, 2020, 3:10 AM IST

జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి మూడులక్షల క్యూసెక్కులకు పైగా వరదనీటిని దిగువకు విడుదల చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలోని నదిపరివాహక ప్రాంతం వరద ముంపులో ఉంది. నీరు పొలాల్లోకి వచ్చిచేరుతోంది. జిల్లాలో పత్తి 165, మిరప 125, మినుము 73.6, పసుపు 25.47, చెరుకు పంటలు 3.2 హెక్టార్లలో పంట నీట మునిగాయని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.

వరదల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేసినట్లు జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. గుంటూరు కలక్టరేట్​ కంట్రోల్ రూమ్ నెం.0863-2324014, తెనాలి సబ్-కలెక్టర్ కార్యాలయం 08644-223800, గుంటూరు ఆర్డీవో కార్యాలయం నెం. 0863-2240679, గురజాల ఆర్డీవో కార్యాలయం నెం.9618617374 కంట్రోల్ రూమ్​లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details