ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఉద్యోగి, సంస్థల రెండు వాటాలను మార్చి, ఏప్రిల్, మే నెలలకు ప్రభుత్వమే చెల్లిస్తుందని... ఈ రాయితీని జూన్, జులై, ఆగస్టు వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్లు ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ కుందన్ వెల్లడించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సంస్థలు వినియోగించుకోవాలన్న ప్రాంతీయ కమిషనర్... ఇప్పటివరకు 51.9 శాతం సంస్థలే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నాయని చెప్పారు. ఈ రాయితీని వినియోగించుకోకపోతే సంస్థతోపాటు ఉద్యోగులకూ నష్టం వాటిల్లుతుందని...ఇప్పటికైనా ఈసీఆర్లు సమర్పించాలని కుందన్ అలోక్ కోరారు.
‘ఉపశమన క్లెయింలు వేగంగా పరిష్కరిస్తున్నాం’ - guntur regional epf officer latest news
కోవిడ్-19 లాక్ డౌన్ వేళ ఉపశమన క్లెయింలు వేగంగా పరిష్కరిస్తున్నట్లు ఉద్యోగుల భవిష్యనిధి... (ఈపీఎఫ్) ప్రాంతీయ కమిషనర్ కుందన్ అలోక్ చెప్పారు. గుంటూరు రీజియన్ పరిధిలో ఇప్పటివరకు 11వేల మంది ఖాతాదారులకు రూ. 37.5 కోట్ల మేరకు క్లెయింలు మంజూరు చేసినట్లు చెప్పారు.
![‘ఉపశమన క్లెయింలు వేగంగా పరిష్కరిస్తున్నాం’ ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ కుందన్ అలోక్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7291378-1108-7291378-1590064226665.jpg)
ఈపీఎఫ్ ప్రాంతీయ కమిషనర్ కుందన్ అలోక్