SNAKE DIED WITH ELECTRIC SHOCK: గుంటూరు జిల్లాలో పాము కారణంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. మేడికొండూరు మండలంలోని పేరెచర్ల సబ్ స్టేషన్లోకి పాము వచ్చి.. విద్యుత్ లైన్లపైకి ఎక్కింది. అటూ ఇటూ తిరిగే క్రమంలో.. విద్యుదాఘాతానికి గురై చనిపోయింది. షాక్ వల్ల ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. దీంతో మండలం మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనూహ్యంగా కరెంటు పోవటంతో విద్యుత్ శాఖ అధికారులు అవాక్కయ్యారు. ఏమైందా అని పరిశీలిస్తే.. కరెంటు లైన్పై చనిపోయిన పాము కనపడింది. మొత్తానికి పాము కారణంగా దాదాపు 2గంటల పాటు కరెంటు సరఫరాలో అంతరాయం తప్పలేదు. అయితే పాముకు షాక్ తగిలినప్పుడు కరెంట్ తీగలు తెగిపడితే పెను ప్రమాదం జరిగి ఉండేదని పలువురంటున్నారు.
కరెంట్ కట్ ఇన్సులేటర్లు ఫట్, ఏమైందంటే
ELECTRIC SUPPLY STOPPED సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేదా మరమ్మతుల కోసం కరెంటు సరఫరా నిలిపివేయటం మనం తరచూ చూస్తుంటాం. అయితే ఎలాంటి కారణం లేకుండా కరెంట్ పోవడంతో అధికారులు కూడా అవాక్కయ్యారు. తీరా అక్కడ జరిగింది తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇది చదవండి.
electricity supply stopped due to snake
Last Updated : Aug 18, 2022, 8:33 PM IST