ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2023, 3:36 PM IST

ETV Bharat / state

మండుతున్న ఎండలు.. పెరిగిన విద్యుత్​ వినియోగం.. విద్యుత్​ కోసం తాత్కాలిక ఒప్పందాలు

POWER CONSUMPTION INCREASING : క్రమక్రమంగా రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడి నుంచి సేద తీరడానికి ఏసీలు, ఫ్రిడ్జ్​ల వాడకాన్ని మొదలుపెట్టారు. దీంతో విద్యుత్ వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నెల ఆరంభంలో 207 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం మరో 30 మిలియన్ యూనిట్ల మేర పెరిగిపోయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 230 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను వినియోగిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్​కో గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం 11,960 మెగావాట్లకు చేరినట్టు స్పష్టమవుతోంది.

POWER CONSUMPTION INCREASING
POWER CONSUMPTION INCREASING

POWER CONSUMPTION INCREASING : రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతల వేడి నుంచి ఉపశమనం పొందటానికి, చల్లదనాన్ని పొందటానికి కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. దీంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో సగటు ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు చేరటంతో విద్యుత్ గరిష్ఠ వినియోగం 230 మిలియన్ యూనిట్లకు చేరినట్టు ఏపీ ట్రాన్స్​కో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆ రెండు నెలల్లో ఎక్కువగా పెరిగే అవకాశం: గృహ, వాణిజ్య అవసరాలతో పాటు పరిశ్రమలు వినియోగిస్తున్న విద్యుత్ డిమాండ్ ప్రస్తుతం 11,960 మెగావాట్లకు చేరినట్టు ఏపీ ట్రాన్స్​కో వెల్లడించింది. ఫిబ్రవరి ఆరంభంలో రాష్ట్రంలో 207 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అయితే.. ప్రస్తుతం గరిష్ఠంగా 230 మిలియన్ యూనిట్లకు చేరినట్టు విద్యుత్ శాఖ స్పష్టం చేస్తోంది. ఏప్రిల్, మే నెలల్లో గరిష్ఠ వినియోగం 250 మిలియన్ యూనిట్ల వరకూ చేరే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. విద్యుత్ డిమాండ్​కు అనుగుణంగా ఏపీ జెన్​కోకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాలు 90 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నాయి.

బహిరంగ మార్కెట్​ నుంచి 40 మిలియన్​ యూనిట్ల కొనుగోలు: ఇక జెన్​కో జల విద్యుత్ కేంద్రాల నుంచి గరిష్ఠంగా 12 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తంగా ఏపీ జెన్​కో నుంచి 104 మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇక ప్రస్తుతం బహిరంగ మార్కెట్ నుంచి 40 మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్​ను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ముందస్తు విద్యుత్ ఒప్పందాల మేరకు 90 మిలియన్ యూనిట్ల వరకూ విద్యుత్ సరఫరా అవుతున్నట్టు తెలుస్తోంది.

ముందస్తు విద్యుత్​ కోసం తాత్కాలిక ఒప్పందాలు: ప్రస్తుతం సగటు విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్​లో 11,600 మెగా వాట్లకు చేరిపోవటంతో వచ్చే రెండు నెలల్లో విద్యుత్ డిమాండ్ 250 మిలియన్ యూనిట్లను మించిపోతుందని ఏపీ ట్రాన్స్​కో అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగానే ఎక్స్చేంజిలో ముందస్తు విద్యుత్ కొనుగోలు కోసం తాత్కాలిక ఒప్పందాలను కూడా చేసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details