ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బ్రాడిపేటలో క్రికెట్ బెట్టింగ్​లు నిర్వహిస్తున్న 8 మంది అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్​లకు పాల్పడుతున్న 8 మందిని గుంటూరు జిల్లా అరండల్​పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.15 వేల నగదు, 7 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Oct 2, 2020, 6:46 AM IST

Published : Oct 2, 2020, 6:46 AM IST

eight members arrested for playing cricket betting in Bradypeta
బ్రాడిపేటలో క్రికెట్ బెట్టింగ్​లు ఆడుతున్న 8 మంది అరెస్ట్

గుంటూరు జిల్లా బ్రాడిపేట హోటల్, గోల్డెన్ పార్క్ లాడ్జిపైన పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఆన్​లైన్​, వివిధ యాప్​ల బెట్టింగ్​లు నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రావెళ్ళ రామకృష్ణ, కనథం నరేంద్ర బాబు, షేక్ ఖాసీం, షేక్ సలీం, నల్లమోతు జితేంద్ర, దోర్సిల మధు, షేక్ సుభాని, షేక్ మౌలాలీలను పట్టుకున్నారు. నిందితుల నుంచి 15 వేల నగదు, 7 సెల్​ఫోన్​లను స్వాధీనం చేసుకున్నారు. వారిని అరండల్​పేట పోలీస్ స్టేషన్​కు తరలించి కేసు నమోదు చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ రమణ కుమార్ తెలిపారు. నగరంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని..వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details