ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడో రోజు ఉత్సాహంగా ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ - eenadu sports league news in narasaraopeta

ఈనాడు సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ నరసరావుపేటలో మూడో రోజుకు చేరుకుంది. ఈనాడు సంస్థ తమలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీస్తోందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. వివిధ కళాశాలల నుంచి పాల్గొన్న క్రికెట్​ జట్లు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నాయి.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/17-December-2019/5403821_150_5403821_1576590543691.png
eenadu sports league in narasaraopeta

By

Published : Dec 17, 2019, 7:40 PM IST

మూడో రోజుకు చేరుకున్న ఈనాడు క్రికెట్ టోర్నమెంట్

గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈనాడు క్రికెట్ టోర్నమెంట్ మూడో రోజుకు చేరుకుంది. స్థానిక సాయి తిరుమల ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతోన్న పోటీల్లో వివిధ కళాశాలల నుంచి క్రికెట్​ జట్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. ఈనాడు సంస్థ తమలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీస్తోందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ఈనాడు నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్​లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నామని క్రీడాకారులు తెలిపారు. ఈ టోర్నీలో విజేతలుగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details