ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 7, 2020, 5:07 PM IST

ETV Bharat / state

పొలంలో కుంగిన భూమి.. రైతుల్లో ఆందోళన

గుంటూరు జిల్లా మాచర్ల పరిధిలోని వెల్దుర్తి మండలంలోని బోదిలవీడులో ఆకస్మాత్తుగా భూమి కుంగిపోయింది. ఫలితంగా పెద్ద గొయ్యి ఏర్పడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

పొలంలో కుంగిన భూమి.. రైతుల్లో ఆందోళన
పొలంలో కుంగిన భూమి.. రైతుల్లో ఆందోళన

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలోని బోదిలవీడులో ఉన్నట్టుండి భూమి కుంగిపోయి గొయ్యి పడటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గ్రామంలోని ధర్మవరపు శ్రీనుకు చెందిన పొలం కుంగిపోయి పెద్ద గొయ్యి పడి ఏర్పడింది.

పొలంలో కుంగిన భూమి.. రైతుల్లో ఆందోళన

అందుకే చీలికాలు వచ్చాయి..
పొలం వద్దకు చేరుకున్న రైతులు అధికారులకు సమచారం అందించారు. గతంలో పలుమార్లు గ్రామంలోని భూమిలో చీలికలు వచ్చాయని, ఇంత పెద్ద గొయ్యి పడటం ఇదే మొదటిసారని రైతులు పేర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు భూమి కుంగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

ఇవీ చూడండి : భూ సమస్యను పరిష్కరించాలంటూ అదనపు కలెక్టర్​ కాళ్లపై పడిన రైతు

ABOUT THE AUTHOR

...view details