ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలింగ్ వేళ తెనాలిలో టెంట్ల వివాదం.. తొలగించిన పోలీసులు - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా తెనాలిలో రోడ్డు పక్కన టెంట్లు వేసిన వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కఠిన చర్యలు తీసుకున్నారు. ఇరు పార్టీల నేతలు ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు.

DSP Sravanthirai
ఓటర్లు మభ్యపెడుతున్నారన్న ఫిర్యాదుపై స్పందించిన డీఎస్పీ స్రవంతిరాయ్

By

Published : Mar 10, 2021, 1:28 PM IST

గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ హై స్కూల్​లో మున్సిపల్​ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ కేంద్రానికి చేరువలో టెంట్లు వేసి భోజనాలు పెట్టి.. కొందరు నాయకులు నగదు పంపిణీ చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారని డీఎస్పీ స్రవంతిరాయ్​కి ఫిర్యాదులు అందాయి. తక్షణమే స్పందించిన డీఎస్పీ... చర్యలు తీసుకున్నారు.

ఈ క్రమంలో.. సదరు రాజకీయ పార్టీ నేతలు తమ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్న టెంట్లు తీయటానికి వీల్లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్​ అమల్లో ఉన్న కారణంగా టెంట్లు వేయటానికి వీల్లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. అక్కడి నుంచి టెంట్లు తీయించి.. వారిని చెదరగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details