'మాచర్ల దాడి ఘటన విచారణకు సహకరించండి'
మాచర్ల, ధరణిలో నమోదైన కేసులలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. విచారణకు హాజరుకావాలని తెదేపా నేతలకు సమాచారమిచ్చినా.. వారు రాలేదని పోలీసులు తెలిపారు.
'మాచర్ల దాడి ఇన్వెస్టిగేషన్కు సహకరించండి'
మాచర్ల, ధరణిలో నమోదైన దాడి కేసులో జరుగుతున్న విచారణకు తెదేపా నేతలు సహకరించాలని డీఎస్పీ హరిబాబు సూచించారు. దాడి ఘటనపై అన్ని వివరాలు గురజాల పీఎస్కు వచ్చి తెలియజేయాలని సూచించామని... కానీ విచారణకు వారు హాజరు కాలేదని తెలిపారు. సమాచారం సేకరించాల్సిన బాధ్యత తమపై ఉన్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. స్టేట్మెంట్ రికార్డు చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు హరిబాబు వెల్లడించారు.