ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కొవిడ్ కేర్ కేంద్రంలో దీపావళి వేడుకలు

గుంటూరు సమీపంలోని అడవితక్కెళ్లపాడు కొవిడ్ కేర్ సెంటర్​లో దీపావళి వేడుకలు జరిగాయి. కరోనా బాధితుల్లో కాస్త ఆనందం నింపేందుకు అధికారులు వీటిని నిర్వహించారు.

By

Published : Nov 14, 2020, 11:00 PM IST

Published : Nov 14, 2020, 11:00 PM IST

Diwali in covid care center
Diwali in covid care center

బాణసంచా కాలుస్తున్న కరోనా బాధితులు

గుంటూరు సమీపంలోని అడవితక్కెళ్లపాడులోని కొవిడ్ కేర్ సెంటర్​లో శనివారం దీపావళి వేడుకలు జరిగాయి. పండగ వేళ కుటుంబానికి దూరంగా ఉన్నామని రోగులు బాధపడకుండా ఉండేందుకు అధికారులు ఈ చిరు ప్రయత్నం చేశారు. ఈ ఆలోచన కొవిడ్ కేంద్రాల్లో యోగా తరగతులు నిర్వహిస్తున్న పతంజలి శ్రీనివాస్​కు రాగా అధికారులతో పంచుకున్నారు. కరోనా బాధితులు భౌతిక దూరం పాటిస్తూనే ఆనందంగా బాణసంచా కాల్చారు. కొవిడ్ కేర్ సెంటర్ ఇంఛార్జ్ పురుషోత్తం, వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బాణసంచా కాలుస్తున్న కరోనా బాధితులు

ABOUT THE AUTHOR

...view details