ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం - గుంటూరులో పోలీసులకు వైకాపా నాయకుల మధ్య ఘర్షణ

పోలింగ్ బూత్​లో నుంచి తెదేపా ఏజెంట్లు బయటకు రావట్లేదని.. గుంటూరు జిల్లా స్టాల్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ బూత్​లో వైకాపా వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులకు, వైకాపా నాయకులకు మధ్య స్వల్ప తోపులాట నెలకొంది.

disputes between police and ycp cadres at guntur
వైకాపా నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం

By

Published : Mar 10, 2021, 10:58 AM IST

గుంటూరులోని స్టాల్ గర్ల్స్ హై స్కూల్ లో పోలింగ్ బూత్ వద్ద తెదేపా ఏజెంట్లు ఎక్కువ సమయం పోలింగ్ బూత్‌లోనే ఉన్నారని.. వైకాపా వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను కూడా పోలింగ్ బూత్‌లోకి అనుమతించాలని.. లేదంటే తెదేపా ఏజంట్లను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, వైకాపా నాయకులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.

వైకాపా నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం

ABOUT THE AUTHOR

...view details