ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మా నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకవస్తాం' - guntur district latest news

ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఒక్క శాతం కూడా తప్పు చేయలేదని ఆయన కుమార్తె నాగసాయి వైదేహి అన్నారు. తన నాన్నను నిర్దోషిగా తీసుక వస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఉదయం సుమారు 100 మంది పోలీసులు వచ్చి నరేంద్రను తీసుకెళ్లారని ఆయన భార్య జ్యోతిర్మయి పేర్కొన్నారు.

dhulipalla narendra kumar arrest in guntur district
'మా నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకవస్తాం'

By

Published : Apr 23, 2021, 10:41 PM IST

'మా నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకవస్తాం'

సంగం డెయిరీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామంలోని ఇంటి వద్ద ఈరోజు ఉదయం ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు.

"ఉదయం ఆరు గంటల సమయంలో సుమారు 100 మంది పోలీసుల వరకు వచ్చారు. నరేంద్ర కుమార్ ఎక్కడ అని ప్రశ్నించారు. బాత్రూం లో ఉన్నారని చెబుతున్నప్పటికీ.. వినకుండా కనీసం దుస్తులు మార్చుకునేందుకు అవకాశం ఇవ్వకుండా తీసుకువెళ్లారు". ధూళిపాల జ్యోతిర్మయి ,నరేంద్ర భార్య

"మా నాన్న ఎక్కడ ఒక్క శాతం కూడా తప్పు చేయలేదని.. అక్రమంగా అరెస్టు చేసినప్పటికీ భయపడటం లేదు. న్యాయపరంగా నాన్నను నిర్దోషిగా బయటకు తీసుకు వస్తాం". నాగ సాయి వైదేహి ,నరేంద్ర కుమార్తె

ఇదీ చదవండి

నిరాధారమైన ఆరోపణలు ఏసీబీకి తగదు: చినరాజప్ప

ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్​కు వ్యతిరేకంగా నిరసనలు

ABOUT THE AUTHOR

...view details