ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 9, 2021, 12:02 PM IST

ETV Bharat / state

చిలకలూరిపేట నుంచి ముందుగానే బయలుదేరిన ప్రభలు...

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి కోటప్ప కొండకు 2 రోజుల ముందుగానే ప్రభలు బయలుదేరాయి. భక్తుల నినాదాల మధ్య 10 ప్రభలు కొండకు బయలుదేరాయి. ఈనెల 10న ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

devotees must abide
devotees must abide

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పురుషోత్తమ పట్నం నుంచి కోటప్ప కొండకు రెండు రోజుల ముందుగానే ప్రభలు బయలుదేరాయి. భక్తుల నినాదాల మధ్య మొత్తం పది ప్రభలు.. కోటప్పకొండకు బయలుదేరాయి. ఈనెల 10న ఎన్నికలు ఉండడంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే విడదల రజినీ ప్రభను నడిపారు. కోటప్పకొండ తిరునాళ్ల రోజున భక్తులందరూ.. పోలీసులు రూపొందించిన ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని.. పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details