ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీధి కుక్కల దాడి... జింక మృతి - గంగిరెడ్డి పాలెం వీధి కుక్కల దాడిలో జింక మృతి

నీటి ఎద్దడి మూగ జీవాల ప్రాణాలను బలిగొంటోంది. నీటి కోసం జనావాసాల్లోకి వచ్చిన జింకను వీధి కుక్కలు వేటాడి చంపిన ఘటన గుంటూరు జిల్లా గంగిరెడ్డి పాలెంలో జరిగింది.

గంగిరెడ్డి పాలెం వీధి కుక్కల దాడిలో జింక మృతి

By

Published : Apr 30, 2019, 3:14 PM IST

గంగిరెడ్డి పాలెం వీధి కుక్కల దాడిలో జింక మృతి

గుంటూరు జిల్లా గంగిరెడ్డిపాలెంలో ఓ జింకను కుక్కలు వేటాడి చంపాయి. ఓ జింక నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి ఊర్లోకి వచ్చింది. జింకను చూసిన కుక్కలు వెంటాడి.. వేటాడి చంపాయని గ్రామస్థులు తెలిపారు. అటవీ ప్రాంతంలో లోతైన కాలువల వల్ల కొంతమందికి వేట సులువైందని...అధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అడవుల్లో వన్యప్రాణులకు నీటి గుంతలు తీయకపోవటం వల్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు జంతువులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details