గుంటూరులో బంతితో ఇంట్లో ఆడుకుంటున్నారు కొందరు పిల్లలు. బంతి ఎగిరి కరెంటు తీగల మీద పడింది. వారి తలిదండ్రులు గమనించలేదు. పిల్లలు ఆ బంతిని కరెంటు తీగలపై నుంచి తీసేందుకు ప్రమాదకర పరిస్థితిలో ప్రయత్నించారు. ఆ సమయానికి పరిసరాల్లో ఉన్న వ్యక్తులు చూశారు కాబట్టి సరిపోయింది. వారు అప్రమత్తం చేయడంతో పిల్లల తల్లిదండ్రులు చూసి.. తమ పిల్లలు ప్రమాదం బారిన పడకుండా కాపాడుకున్నారు.
పేరెంట్స్ ..కాస్త పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి! - danger zone kids in guntur district latest news
కరోనా కాలం.. పిల్లలకు స్కూళ్లు లేవు. బయటికి వెళ్లి ఆడుకోలేని పరిస్థితి. ఏ ఆట అయినా ఇంట్లోనే ఆడుకునే దుస్థితి. ఈ క్రమంలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. ఈ క్రమంలో వారు కొన్ని సార్లు ప్రమాదం బారిన పడుతున్నారు. తల్లిదండ్రులూ పిల్లలను కాస్త గమనించాలి.
![పేరెంట్స్ ..కాస్త పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి! danger zone kids in guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8128961-542-8128961-1595441744768.jpg)
danger zone kids in guntur district