గుంటూరులో ఏర్పాటు చేసిన బాణాసంచా విక్రయ కేంద్రాల్లో... కొనుగోలుదారులు ధరలు చూసి వెనక్కి తగ్గుతున్నారు. టపాకాయలపై జీఎస్టీ పేరుతో అదనపు వడ్డింపులు... కొనుగోలుదార్లను నిరుత్సాహపరుస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ధరలు 20 నుంచి 30 శాతం పెరిగాయి. పర్యావరణ హితం కోసం సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరగిన కారణంగా చైనా దిగుమతులు మార్కెట్లోకి అంతగా రాలేదు. తుపాను భయంతో దుకాణాలు తక్కువగానే పెట్టగా.... కొనుగోళ్లు సైతం అంతంతమాత్రంగానే కొనసాగాయి.
ఆకాశన్నంటిన టపాసుల ధరలు... తగ్గిన కొనుగోళ్లు - crackers rates hike at gunta ground of guntur
దీపావళి వచ్చిందంటే ఆ సందడే వేరు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాది ఆనందోత్సహాల నడుమ వేడుక జరుపుకొంటారు. ఇదే అదునుగా మార్కెట్లో బాణాసంచా ధరలు భగ్గుమంటున్నాయి. టపాసుల ధరలు తారాజువ్వల్లా ఆకాశాన్ని అంటుతున్నాయి.
![ఆకాశన్నంటిన టపాసుల ధరలు... తగ్గిన కొనుగోళ్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4884199-1097-4884199-1572183748675.jpg)
ఆకాశన్నంటుతున్న టపాసుల ధరలు...సందిగ్ధంలో కొనుగోలుదారులు