CPI Ramakrishna Fire on CM Jagan: ఐదు కోట్ల మంది ప్రజలతో ముడిపడి ఉన్న జిల్లాల విభజన అంశాన్ని... రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ఎందుకు చేపడుతుందో వెల్లడించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కొత్త జిల్లాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలతోనూ చర్చించకపోవటం దారుణమని అన్నారు. గుంటూరు సీపీఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన..జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయాన్ని సీఎం జగన్ ఏకపక్షంగా తీసుకున్నారని దుయ్యబట్టారు. సున్నితమైన అంశంపై ఆన్లైన్లో హడావుడిగా మంత్రుల ఆమోదం తీసుకోవటమేంటని ప్రశ్నించారు.
సీఎంకు మంత్రులపై విశ్వాసం లేదు..