ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు.. ఏపీకి చెందిన అంశం మాత్రమే కాదని... దేశ వ్యాప్తంగా ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సీపీఐ 95వ వార్షికోత్సవ బహిరంగ సభలో డి. రాజాతోపాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రామకృష్ణ పాల్గొన్నారు. ఏపీ సీఎం మూడు రాజధానుల విషయంలో స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. అమరావతి కోసం ఇచ్చిన భూముల అంశం వేరు... 3 రాజధానుల అంశం వేరని అన్నారు.
3 రాజధానులపై దేశవ్యాప్త చర్చ జరగాలి: డి.రాజా
ఏపీలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరగాల్సి ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా అభిప్రాయపడ్డారు. గుంటూరులో నిర్వహించిన సీపీఐ 95 వ వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
cpi secretary d.raja about capital amaravathi
TAGGED:
ap 3 capital news