ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాగులపాడులో ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో ఇద్దరు యువకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అధికారులు నాగులపాడును కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు.

By

Published : Jul 4, 2020, 3:57 PM IST

covid positive in guntur dst pedanandipadu mandal nagulapdu
covid positive in guntur dst pedanandipadu mandal nagulapdu

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో నివాసం ఉంటున్న ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. వారిద్దరూ ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. వారు ఎక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు అనే వివరాలను అధికారులు సేకరించారు.

ఆ బాధితులు నివాసం ఉంటున్న రూమ్​లో ఒక మహిళ పనులు చేసేది. ఆమె కాకుమాను మండలం కొమ్మూరుకు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెను ఇంట్లోనే ఉండాలని బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు. నాగులపాడును కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించారు.

ఇదీ చూడండి

కరోనాతో ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు కన్నుమూత

ABOUT THE AUTHOR

...view details