ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతనాలు అడిగితే.. బౌన్సర్లను పెట్టి బెదిరిస్తున్నారు! - కరోనా ఉద్యోగులకు జీతాలివ్వాలని గుంటూరులో నిరసన

ప్రాణాలను పణంగా పెట్టి వీరా బస్సుల్లో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని... గుంటూరు జిల్లాలో సిబ్బంది ధర్నా చేపట్టారు. 3 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని వారు వాపోయారు. బస్సులను రాత్రి సమయాల్లో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని... సంస్థ తమకు వెంటనే జీతాలని చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు అడిగితే బౌన్సర్లతో బెదిరిస్తున్నారని... తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

covid employees working in veera buses protest at guntur district
వేతనాలు చెల్లించమంటే బౌన్సర్లను పెట్టి బెదిరిస్తున్నారు

By

Published : Nov 21, 2020, 6:44 AM IST

నెలల తరబడి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న తమకు వేతనాలు ఇవ్వాలని.. వీరా బస్సులలో పనిచేస్తున్న కొవిడ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. గుంటూరు కలెక్టరేట్​లో వారు ధర్నా చేపట్టారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ప్రాణాలను పణంగా పెట్టి... ఉద్యోగం చేస్తున్నామని చెప్పారు.

వేతనాలు లేక అనేక ఇబ్బందులకు పడుతున్నామన్నారు. జీతాల కోసం... నవంబర్ 1 నుంచి పరీక్షలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. వీరా సంస్థ బస్సులను అర్థరాత్రి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సంస్థ తమకు వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. జీతాలు అడిగితే... బౌనర్లతో బెదిరిస్తున్నారని ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details