ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాచేపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు.. యంత్రాంగం అప్రమత్తం - ap corona live updates

గుంటూరు జిల్లా దాచేపల్లిలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జిల్లాలో ఇవాళ కొత్తగా 4 కేసులు నమోదు కాగా... మొత్తం సంఖ్య 9కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

covid cases increasing in guntur dst dachepalli
దాచేపల్లిలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Apr 22, 2020, 8:06 PM IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గుంటూరు జిల్లా దాచేపల్లిలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం పాజిటివ్​ కేసులు 9కి చేరాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దాచేపల్లి, గుంటూరు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి.. లాక్​డౌన్​ను పక్కాగా అమలు చేస్తున్నారు. మండలంలో రెడ్​జోన్ల నుంచి వేరే మండలాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత మండలాల్లో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details